Wednesday, February 16, 2011

అందరూ ఆహ్వానితులే!!

                                                  (డిజైన్ చేసిన వ్యక్తి పేరు: 'సంతోష్' )

Monday, January 31, 2011

Thursday, January 27, 2011

ఎంత విడ్డూరమో ...!

 

పెరుగిన ముడిసరకుల ధరలతో ప్రస్తుతం పేదవాడు మూడు పూట్ల భొజనం మాట దేవుడెరుగ,
తృప్తిగా రెండు పూట్ల చేతివేళ్ళు నొటి దగ్గరకి వెళ్ళడమే కష్టం.
పెరిగిన ధరల పై మేమంటే మేము పోరాడుతాము అని పేదలకి మాటలిచ్చి నాయకులై వారి కష్టాల్ని మరిచి విలాస వంతమైన భవనాలలో భొగ భగ్యాలు అనుభవిస్తూ కాలం వెలిబుచ్చుతున్నారు.
భారత దేశంలో అతి చవకగా ఆహారం దొరికే ప్రాంతం మీకెవరికన్న తెలుసా.?
అదే మన భారత దేశ పార్లమెంటరీ భవన క్యాంటీన్,ఢిల్లీ,    
అక్కడ దొరికే పధార్దాల రేట్ల విషయానికి వస్తే ఇవిగో,

టీ - 1 రూ||
సూప్ - 5.50 రూ||
పప్పు - 1.50 రూ||
భొజనం - 2.00 రూ||
చపాతి - 1.00 రూ||
చికెన్ - 24.50 రూ||
దోస - 4.00 రూ||
వెజ్ బిర్యాని - 8.00 రూ||
ఫిష్ - 13.00 రూ||

ఇలా ఎన్నో .....

ఈ పదార్దాలు దేశ సేవ చేసే నాయకుల కోసం అంట (వారి వుద్దేశం వాళ్ళు పేదలని),
కాని మనకి సేవ చేసే నాయకుల నెలసరి ఆదాయం 80,000/-,
ఎంత  విడ్డూరమో ...! 

ఈ రేట్లని చూస్తే ప్రతి పేదవానికి ఆశ కలగక మానదు,
మాకు ఇలాంటి ధరలలో ఆహారం దొరకపోదా అని..
కానీ నమ్మక ద్రొహం చేసే నాయకులని గెలిపించినంత కాలం అది అందనంత ఎత్తులో వున్న జాబిలీ అని ఎప్పుడు తెలుస్తుందో ఏమో...!